
రాయనపాడులో మరిన్ని రైళ్లకు హాల్ట్
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడరూరల్: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మైలవరం నియోజకవర్గంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ అభివృద్ధి కావడంతో మైలవరం ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఇదే స్కీమ్ కింద కొండపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. మంగళవారం కొండపల్లి, రాయనపాడు రైల్వేస్టేషన్లను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. కొండపల్లి రైల్వే స్టేషన్ మాస్టర్తో పాటు, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాయనపాడు రైల్వేస్టేషన్లో మూడు, నాలుగు నంబర్ ప్లాట్ ఫామ్స్ కూడా రెడీ కాబోతున్నాయన్నారు. మరిన్ని రైళ్లు ఆగే విధంగా చూస్తామన్నారు.
అకస్మాత్తుగా పొంగుతోంది..
అనంతరం కొండపల్లి ఎస్టీ కాలనీ వద్ద రైల్వే లైన్ కింద డ్రెయినేజీని కూడా ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ పరిశీలించారు. పూడికను తొలగించక పోవడం వల్ల అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల డ్రెయినేజీ నీటితోపాటు వరదనీరు ఉప్పొంగి సమీప గృహాలు వరద ముంపునకు గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే ఎంిపీకి వివరించారు. డీఆర్ఎం మీటింగ్లో ఈ సమస్యను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు, బీజేపీ ఇన్చార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.