
మచిలీపట్నం బీచ్కు జాతీయస్థాయిలో పేరుకు కృషిచేస్తా
మచిలీపట్నంటౌన్: మంగినపూడి బీచ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా తీర్చిదిద్దుతామని గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మసులా బీచ్ ఫెస్ట్–2025 వేడుకల్లో భాగంగా మూడవరోజు శనివారం మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. తొలుత మంత్రి రవీంద్ర పారా గ్లైడింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ మసులా ఫెస్ట్ –2025 కు సందర్శకులు విశేషంగా తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. వాటర్ స్పోర్ట్స్, పారా గ్లైడింగ్, హెలీ రైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. సాయంత్రం వేళ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిగా తిలకిస్తున్నారన్నారు. బీచ్లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తలెత్తకుండా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు బాగున్నాయన్నారు. అనంతరం సీ కయాకింగ్ పోటీలను మంత్రి రవీంద్ర తిలకించారు. ఈ సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత, కయా కింగ్ కోచ్ జయంత కుమార్ను అభినందించారు. కయా కింగ్ క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా జెర్సీలను అందజేశారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మంగినపూడి బీచ్ పేరు దేశమంతా మార్మోగేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ కిరణ్పాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర