సీఎం చంద్రబాబును కలిసిన కేడీసీసీబీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబును కలిసిన కేడీసీసీబీ చైర్మన్‌

Jun 8 2025 1:26 AM | Updated on Jun 8 2025 1:26 AM

సీఎం

సీఎం చంద్రబాబును కలిసిన కేడీసీసీబీ చైర్మన్‌

చిలకలపూడి (మచిలీపట్నం): సీఎం నారా చంద్రబాబునాయుడును కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ నెట్టెం శ్రీరఘురామ్‌ వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌గా రఘురామ్‌ను ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

మద్యం మత్తులో డ్రెయిన్‌లో పడి వ్యక్తి మృతి

పెనమలూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి డ్రెయిన్‌లో పడి మృతి చెందిన ఘటనపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని 40 ఏళ్ల వ్యక్తి మద్యం తాగి బందరు రోడ్డులో నడుస్తూ పీవీఆర్‌ ఐకాన్‌ వద్ద డ్రెయిన్‌లో పడిపోయాడు. ఈ మార్గంలో వెళ్తున్నవారు అతడిని గుర్తించి బయటకు తీసి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్సకు చేర్చారు. అయితే ఆ వ్యక్తి ఆస్పత్రిలో రాత్రి మరణించాడు. గుర్తు తెలియని వ్యక్తి వివరాలు తెలిసిన వారు 99517 46017 ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలపాలని పోలీసులు కోరారు.

సీఎం చంద్రబాబును కలిసిన కేడీసీసీబీ చైర్మన్‌  1
1/1

సీఎం చంద్రబాబును కలిసిన కేడీసీసీబీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement