
కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు,
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
–8లోu
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించింది. రాజకీయ నాయకులపై 89, సోషల్ మీడియా యాక్టివిస్టులపై 94, ప్రజా సంఘాలపై 11, జర్నలిస్టులపై 13 కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షలతో బుక్కీపర్లు, ఉపాధి హామీ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తాజాగా ఎండీయూ వాహనాలను తొలగించారు. విజయవాడ నగరంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఆస్తుల ధ్వంసం, వ్యాపారాలు దెబ్బతీసి ఆర్థికంగా కుంగదీశారు.
యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ..
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ కూటమి దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు దోచుకుంటున్నారు. జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీకి కూటమి నేతలు తెరతీశారు. పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి మద్యంలో దోపిడీ చేస్తున్నారు. పోలవరం మట్టి, గ్రావెల్స్ క్వారీలు, మైనింగ్లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. సహజవనరులను టీడీపీ కూటమి అడ్డగోలుగా దోచుకుంటోంది.
శత విధాలా మోసం..
మేనిఫెస్టోలో సూపర్సిక్స్తోపాటు సూపర్సిక్స్ 2.0 షణ్ముఖ వ్యూహం హామీ.. ఇదే పీ4, పూర్ టు రీచ్ అంటూ గొప్పలు చెప్పారు. పేదలను ధనికులు చేస్తామంటూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నందిగామ నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ప్రారంభించారు. కానీ ఇంతవరకు జిల్లాలో ఎంపికై న బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకులు దొరకలేదు. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఇక అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ. 20వేలు అందిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి నేటికీ అతీగతీ లేదు. ఇలా విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి వర్గాన్ని కూటమి వెన్నుపోటు పొడిచింది.
న్యూస్రీల్
సూపర్సిక్స్ అంటూ అరచేతిలో వైకుంఠం ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని కూటమి ప్రభుత్వం ఓటు వేసిన ప్రజానీకానికి వెన్నుపోటు కూటమి మోసాలను ఎండగడుతూ నేడు వైఎస్సార్ సీపీ నిరసన జిల్లా వ్యాప్తంగా ప్రజా భాగస్వామ్యంతో నిర్వహణకు ఏర్పాట్లు
ఎడతెగని వంచన
ఏడాది పాలన..
కూటమి ఎన్నికల హామీల్లో సూపర్సిక్స్ పేరుతో ఊరూ వాడా ఊదరగొట్టారు. యువతకు ఉద్యోగాలు, నెలకు రూ. 3వేల ఉద్యోగ భృతి. ఏడాదిలో ఒక్కరికీ ఉద్యోగం లేదు.. భృతి లేదు. ఇక మెగా డీఎస్సీ పేరుతో పెద్ద దగా చేశారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15వేలు.. ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళ కు నెలకు రూ. 1500. ఈ హామీ ఊసే ఎత్తడం లేదు. ఉచిత బస్సు ఏడాదిగా హుళక్కే. షరతులతో ఎక్కువ మందికి వర్తించకుండా ఉచిత గ్యాస్ అమలు చేశారు.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు,

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు,

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు,