
ప్రశాంతంగా గ్రూప్–1 మెయిన్స్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శనివారం నగరంలో ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం తొలిరోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నగరంలో మొత్తం 1,801 మంది అభ్యర్థులకు గాను 1,161 మంది (64.46 శాతం) హాజరయ్యారు. ఈ నెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రాత పరీక్ష (ట్యాబ్ ఆధారిత, డిస్క్రిప్టివ్) ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతుంది. విజయవాడలో ఆరు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ శనివారం ఉదయం బిషప్ అజరయ్య బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఫర్నిచర్, లైటింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్ క్యాంప్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. లైజనింగ్ అధికారులు, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు, సూపర్వైజర్లు పటిష్ట సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రత పరంగా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగనున్న పరీక్షలు తొలి రోజు 1,801 మంది అభ్యర్థులకు గాను 1,161 మంది హాజరు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశ

ప్రశాంతంగా గ్రూప్–1 మెయిన్స్