బండెనక బండి కట్టి.. | - | Sakshi
Sakshi News home page

బండెనక బండి కట్టి..

Apr 24 2025 1:25 AM | Updated on Apr 24 2025 1:25 AM

బండెన

బండెనక బండి కట్టి..

కంచికచర్ల: చందర్లపాడు మండలం తుర్లపాడులో నిర్వహించే బడేహజరత్‌ ఉరుసు ఉత్సవాలకు ముస్లింసోదరులు బుధవారం భారీగా తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి ముస్లింలు ఎడ్లబండ్లతో ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యేందుకు తరలివచ్చారు. ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లే ఎండ్లబండ్లను కంచికచర్ల మండలంలోని పెండ్యాల మున్నేటి తీరాన మాజీఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు బుధవారం ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన ముస్లింలు బండెనక బండి కట్టి ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లారు. ఈసందర్భంగా డాక్టర్‌ జగన్‌మోహనరావు మాట్లాడుతూ మతాలకతీతంగా అందరూ ఉరుసు ఉత్సవాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎడ్లబండ్లపై ఉత్సవాలకు వెళ్తున్న భక్తులకు మున్నేటి తీరాన ఎంపీపీ షేక్‌ మలక్‌బషీర్‌ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశారు. ఉరుసు ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్ల సవారీలను చూసేందుకు పెండ్యాల మునేటి తీరానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యు లు షేక్‌ బడేహజరత్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌ షేక్‌ గౌస్‌పాషా, సయ్యద్‌ అహ్మద్‌, షేక్‌ పీర్‌సామియా, షేక్‌ చాన్‌బహుదూర్‌, ఫయీంపాష, అబ్దుల్‌కరీం, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు.

ఉరుసు ఉత్సవాలకు తరలిన ముస్లింలు

బండెనక బండి కట్టి.. 1
1/1

బండెనక బండి కట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement