
సమస్య పోయేదెన్నడు?
పోడు
వర్ని మండలం జలాల్పూర్ అటవీ ప్రాంతంలో సిద్ధాపూర్ గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎఫ్ఆర్వో గంగాధర్ (ఫైల్)
డొంకేశ్వర్(ఆర్మూర్): ఒకవైపు అడవుల్లో కలప కో సం చెట్ల నరికివేత, మరో వైపు పోడు భూముల ఆ క్రమణ.. ఈ రెండు విషయాలు అటవీ శాఖ ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వ ర్షాకాలం వచ్చిందంటే చాలు పోడు భూముల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతోంది. అటవీ భూ ములను రక్షించడానికి వెళ్లిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. కళ్లల్లో కారం చల్లి చంపేంత పనిచేస్తున్నారు. దీంతో అటవీ ఉద్యోగులు ప్రాణభయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో నిజామాబాద్ సౌత్, ఇందల్వాయి. సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల పరిధిలో అటవీ భూముల ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో 4,229 మందికి పోడు పట్టాలను పంపిణీ చేసి అటవీ భూములను దున్నుకునేందుకు అవకాశం కల్పించింది. పోడు కొడితే మాకు కూడా పట్టాలు వస్తాయనే ఆశతో ఇప్పుడు మరికొందరు భూములను దున్నుతున్నారు. అయి తే అటవీ భూములను రక్షించే విషయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అడవులను ఆక్రమిస్తే అధికారులను బా ధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకుంటోంది. దీంతో అటవీ స్థలాలను కాపాడడం ఆ శాఖ ఉద్యోగులకు పెద్ద సవాల్గా మారింది. వ్యక్తులపై ఎన్ని కేసు లు నమోదు చేసినా, ట్రాక్టర్లు సీజ్ చేసినా అడవుల్లో మళ్లీ పోడు కొడుతూనే ఉన్నారు. అటవీ చట్టాలు, శిక్షలు కఠినంగా లేకపోవడంతోపాటు తమకు ఆ యుధాలు లేకపోవడంతో పోడు భూములను ఆక్రమిస్తున్నారని ఫారెస్టు ఉద్యోగులు పేర్కొంటున్నా రు. పోడు కొట్టిన వ్యక్తులను కోర్టుకు తీసుకెళ్తే బెయిలబుల్ కేసు కావడంతో ఏడేళ్లలోపే శిక్ష వేయడానికి అవకాశముంది. శిక్షను అనుభవించకుండా ఉండేందుకు తిరిగి అటవీ అధికారుల నుంచి బెయిల్ తీసుకొని తిరుగుతున్నారు. అదే నాన్బెయిల్ కేసు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, చట్టాన్ని కఠినంగా చేయాలని అటవీ ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే పోడు సమస్య పోయే దాకా తమ పరిస్థితి ఇంతే ఉంటుందని, అటవీ ఆక్రమణలు నిలువరించడం కష్టసాధ్యమని చెప్తున్నారు.
ఎనిమిదేళ్లలో కేసుల తీరు..
కేసులు నమోదు చేస్తున్నా ఆగని అటవీ ఆక్రమణలు
జిల్లాలో ఫారెస్టు అధికారులపై
కొనసాగుతున్న దాడులు
తలనొప్పిగా మారిన
పోడు భూముల వ్యవహారం

సమస్య పోయేదెన్నడు?