
పాతికేళ్ల తర్వాత మోగిన గంట
సుభాష్నగర్: జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో పురాతన గడియారానికి పునర్జీవం వ చ్చింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత గంజ్లో బుధవారం మళ్లీ గంట మోగింది. 1905లో సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి గంజ్లో గడియారాన్ని ఏర్పాటు చేశా రు. ఆ గడియారం రైతులు, స్థానిక వ్యాపారు లు, ప్రజలకు వందేళ్లపాటు సమయాన్ని తెలిపింది. అడపాదడపా మరమ్మతులు చేస్తూ కొన్నిరోజులు నెట్టుకొచ్చినా.. సరైన నిర్వహ ణ లేక మధ్యలో ఆగిపోయింది. నిజామాబా ద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రూ.4.35 లక్షలు కేటాయించారు. దీంతో ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన తాజ్ కంపెనీలో తయారైన బ్యాటరీ గడియారాన్ని బిగించారు. ఈ గడియారం సమయం తెలియజేయడంతోపాటు ప్రాత:కాలం, సుప్రభాతం, పరిసరాల శుభ్రత, గంజ్ నియ మాల అనౌన్స్మెంట్ చేస్తుంది. తిరుపతిలో గడియారం ఏర్పాటు చేసిన కంపెనీయే దీనిని తయారు చేయడం విశేషం.
గాంధీగంజ్లో క్లాక్టవర్కు
కొత్త గడియారం