
కష్టపడ్డ వారికి కచ్చితంగా గుర్తింపు
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీకోసం కష్టపడ్డవారిని, కష్టకాలంలో పార్టీని కాపాడుకున్నవారికి క చ్చితంగా గుర్తింపు లభిస్తుందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జీవీ రామకృష్ణకు క్రమశిక్షణాసంఘం సభ్యుడిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో బుధవారం వారిద్దరినీ పార్టీ తరపున సన్మానించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, క్రమశిక్షణా సంఘం సభ్యుడు జీవీ రామకృష్ణను గజమాలతో సత్కరించి, అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన నాయకులకు టీపీసీసీలో చోటు దక్కడం, సముచితంగా ఉందన్నారు. తమపై నమ్మకంతో టీపీసీసీలో ఉన్నత పదవులు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డికి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్గౌడ్కు, ఏఐసీసీ పెద్దలకు రాంభూపాల్, జీవీ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు రత్నాకర్, విపుల్ గౌడ్, లింగం, సంతోష్, నవాజ్, ప్రీతం, రాజేంద్ర ప్రసాద్, నరేందర్సింగ్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి
టీపీసీసీ పదవులు పొందిన
రాం భూపల్, రామకృష్ణలకు సన్మానం