
రైతు సమ్మేళన సభాస్థలి పరిశీలన
సుభాష్నగర్: నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించే రైతు సమ్మేళనం బహిరంగ సభాస్థలిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం సాయంత్రం పరిశీలించారు. సభకు కేంద్ర హోంశా ఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు, పోలీస్ అధికారులతో ఆయన భ ద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. 29న జాతీయ ప సుపుబోర్డు కార్యాలయం ప్రారంభం, కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో డీఎస్ విగ్రహావిష్కరణ, పాలిటెక్నిక్ మైదానంలో రైతు సమ్మేళనం కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ఎంపీ అర్వింద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాలిటెక్నిక్ మైదానాన్ని ఎంపీ అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపు, వేదిక తదితర ఏర్పాట్లపై కేంద్ర బలగాలు, పోలీస్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జిల్లాకు చేరుకునే అవకాశముందని ఎంపీ తెలిపారు. ఆయ న వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, ఏసీపీ రాజావెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.
నేడు నిజామాబాద్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి!
29న జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రత, బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్షించేందుకు గురువారం కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి జిల్లాకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం, బహిరంగ సభ నిర్వహించే పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని కిషన్రెడ్డి పరిశీలించనున్నారు.
భద్రత ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఎంపీ అర్వింద్ సమీక్ష
29న జిల్లాలో పర్యటించనున్న
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా