
ప్రయివేటు నుంచి ప్రభుత్వానికి మారిన కళాశాల
మీకు తెలుసా?
ఆర్మూర్ పట్టణ శివారులోని పిప్రి రోడ్డులోగల 105 ఎకరాల విస్తీర్ణంలో కేవీ రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో 1966లో ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి కళాశాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ లక్ష్మణ్రావ్ ఈ కళాశాలకు మొట్ట మొదటి ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు.
● 1967 జూలై 3న యూజీసీ పరిధిలోకి తీసుకొని యూజీసీ యాక్ట్ 2ఎఫ్ (12బీ) గుర్తింపును ఇచ్చారు. 1969–70లో ఇంటర్మీ డియట్ విధానాన్ని ప్రారంభించారు.
● 1981లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కళాశాలను స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా పిలవడం ప్రారంభించారు.
● 1996లో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రెండుగా వేరు చేశారు.
● 2006లో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ (ఎన్ఏఏసీ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్) మొదటి ఫేస్ గుర్తింపు వచ్చింది.
● జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనంతరం జిల్లాలో నాక్ గుర్తింపు ఉన్న ఏకై క ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్ కళాశాల. – ఆర్మూర్