
ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో ని ఎర్రాపహాడ్ గ్రా మంలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం అ యినట్లు గ్రామస్తు లు తెలిపారు. గ్రా మానికి చెందిన మైసాగౌడ్ మూడు సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాడు. ఆదివారం అతడు తన ఇంటి ముందు స్కూటీని నిలిపి చార్జింగ్ ఉంచారు. చార్జింగ్ పూర్తయిన అనంతరం విద్యుత్ కనెక్షన్ తీసివేశాడు. కానీ అప్పటికే చార్జింగ్ కారణంగా వేడెక్కిన స్కూటీకి ఎండలు కూడా ఎక్కువగా ఉండడంతో అందరు చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్కూటీ పూర్తిగా బూడిదయిందన్నారు.