
విద్యుత్షాక్తో యువకుడి మృతి
ఎల్లారెడ్డి: విద్యుత్షాక్తో యువకుడు మృతిచెందిన ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తిమ్మాపూర్తండాకు చెందిన నేనావత్ రవి(32)అనే యువకుడు ఆదివారం సాయంత్రం తమ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన బేస్మెంట్కు నీళ్లు పట్టడానికి వెళ్లాడు. ఈక్రమంలో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం: ఓ తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని గుమాస్తా కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా.. హన్మకొండకు చెందిన నయీంపాషా యేడాదిన్నరగా కామారెడ్డి డీఎంహెచ్వో కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తూ గుమాస్తా కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆరోగ్య సమస్యల కారణంగా 6 నెలలుగా హన్మకొండకు కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఆదివారం ఉదయం అతడి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని రాజయ్య వెంటనే నయీంపాషాకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బంది విచారణ జరిపారు. ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.
షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం
బాన్సువాడ: పట్టణంలోని బాట చెప్పుల దుకాణంలో ఆదివారం మధ్యాహ్నం షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. షోరూం నిర్వాహకులు ఉదయం దుకాణం తెరిచి మధ్యాహ్నం మూసివెళ్లారు. కొద్దిసేపటికి దుకాణంలోంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి దుకాణ యజమానికి సమాచారం అందించారు. వెంటనే ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే మంటల వ్యాపించి దుకాణంలోని సామగ్రి, చెప్పులు కాలిపోయాయి. దుకాణంలో పెద్ద ఎత్తున పొగ నిండిపోవడంతో లోపల ఉన్న వస్తువులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు షోరూం యజమాని తెలిపారు.

విద్యుత్షాక్తో యువకుడి మృతి

విద్యుత్షాక్తో యువకుడి మృతి