
కువైట్లో గుండెపోటుతో మిట్టాపల్లి వాసి ..
డిచ్పల్లి: మండలంలోని మిట్టాపల్లి గ్రామానికి చెందిన సిర్నాపల్లి గంగాధర్ (45) బతుకుదెరువు కోసం కువైట్ దేశానికి వెళ్లగా, రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గంగాధర్ ఐదేళ్ల క్రితం కువైట్ దేశానికి వెళ్లగా, గతంలో ఒకసారి గుండెపోటు రావడంతో చికిత్స పొందాడు. సెలవుపై స్వగ్రామానికి వచ్చి రెండు నెలల క్రితం తిరిగి వెళ్లాడు. రెండు రోజుల క్రితం డ్యూటీలో ఉండగా మరోసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతివార్త కుటుంబసభ్యులకు తెలియడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వం కృషి చేయాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.