దురలవాట్లకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

దురలవాట్లకు దూరంగా ఉండాలి

Apr 15 2025 2:00 AM | Updated on Apr 15 2025 2:00 AM

దురలవాట్లకు దూరంగా ఉండాలి

దురలవాట్లకు దూరంగా ఉండాలి

డిచ్‌పల్లి: విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని, బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య సూచించారు. మండలంలోని సుద్దపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఆదివారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని పట్టుదలతో చదివి లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. డిచ్‌పల్లి సీఐ మల్లేష్‌, ఎస్సై ఎండీ షరీఫ్‌, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్‌ ధనుంజయ్‌, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement