
సర్వత్రా హర్షం
రేషన్ దుకాణాల ముందు బారులుతీరిన కార్డుదారులు
సుభాష్నగర్: సన్నబియ్యం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరింది. రేషన్దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రంగా దేశ చరిత్రలో తెలంగాణ నిలిచింది. జిల్లావ్యాప్తంగా 759 రేషన్దుకాణాల ద్వారా మంగళవారం నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఉదయం నుంచే కార్డుదారులు దుకాణాల వద్ద బారులు తీరారు. మొదటిరోజు 1,752 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
అట్టహాసంగా ప్రారంభం
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. నిజామాబాద్ రూ రల్ మండలంలోని మల్లారం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి లాంఛనంగా బి య్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ, కోటగల్లి, అహ్మద్పురా కాలనీల్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ తా హెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలకు హాజరయ్యారు. సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, సహాయ అధికారి రవి రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.
● మొదటిరోజు 1752 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
● మల్లారంలో పంపిణీని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి