ఈ ఎన్నారై.. మనసున్న ‘శ్రీమంతుడు’ | - | Sakshi
Sakshi News home page

ఈ ఎన్నారై.. మనసున్న ‘శ్రీమంతుడు’

Apr 1 2025 11:15 AM | Updated on Apr 1 2025 1:29 PM

ఈ ఎన్

ఈ ఎన్నారై.. మనసున్న ‘శ్రీమంతుడు’

మోర్తాడ్‌: గ్రామంలో ఎవరికై నా ఆపదొస్తే.. ముందు తలచేది ఆయన పేరే. సాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా నేనున్నానంటూ ఆపద్భాంధవుడిలా ఆదుకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం ధర్మోరాకు చెందిన ముస్కు అనూప్‌రెడ్డి అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. తాను పుట్టి, పెరిగిన గ్రామానికి విద్య, వైద్యానికి చేయూతనందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

మెరుగైన విద్య కోసం..

ధర్మోరా గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ, ఉపాధ్యాయుల పోస్టులు తక్కువగా ఉండడంతో వీడీసీ ఆధ్వర్యంలో విద్యావలంటీర్లను నియమించాల్సి వచ్చింది. కమిటీ వద్ద నిధుల కొరత ఉండడంతో ఈ విషయాన్ని అనూప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పిల్లలకు మెరుగైన విద్యనందించాలనే ఉద్దేశంతో క్షణం ఆలోచించకుండానే విద్యావలంటీర్ల వేతనాలు అందించేందుకు ముందుకొచ్చారు. అలా ఐదేళ్ల నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించి వారికి ప్రతి నెలా రూ.16వేల వేతనాన్ని సొంతంగా సమకూరుస్తున్నారు. ఉన్నత పాఠశాలకు చెందిన అదనపు తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోగా, అనూప్‌రెడ్డి రూ.12లక్షలు సమకూర్చారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి గదుల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని గ్రామస్తులకు సూచించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రి బిల్లులు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉండే పేదలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. ఆస్పత్రి బిల్లులను చెల్లిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. వందలాది కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం లక్షల రూపాయాలు సాయం అందించి అందరి మనసులో నిలిచారు.

ధార్మిక సేవలో..

కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి అంటే అందరికీ భక్తి. గ్రామస్తులకు అందుబాటులో ఉండేలా రూ.1.50 కోట్లతో ధర్మోరాలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్వహణ, పురోహితుని జీత భత్యాల కోసం ప్రత్యేకంగా నిధిని సైతం సమకూర్చారు. 20 ఏళ్లుగా అమెరికాలో వ్యాపారం చేస్తూ స్థిరపడిన అనూప్‌రెడ్డి పుట్టి పెరిగిన ఊరికి, ఆపదలో ఉండే వారికి కొండంత అండగా నిలుస్తూ స్ఫూర్తిమంతుడిగా నిలుస్తున్నారు.

కష్టపడి సంపాదించాలి.. సంపాదించిన దానిలో వీలైనంత ప్రజలకు పంచాలి. ప్రపంచంలో మంచి జరగడానికి తనవంతు సాయంగా నిలవాలంటున్నాడీ ప్రవాస భారతీయుడు. తన కుటుంబం బాగుంటే చాలు.. పక్కవాడికి ఏమైతే ఏంటీ అనుకుంటున్న ప్రస్తుత సమాజంలో.. సహాయానికి మారుపేరుగా నిలుస్తున్నాడు ముస్కు అనూప్‌రెడ్డి.

అమెరికాలో వ్యాపారవేత్తగా

స్థిరపడిన ధర్మోరా వాసి

సొంతూరులో విద్య, వైద్యానికి

చేయూతనందిస్తున్న అనూప్‌రెడ్డి

ఈ ఎన్నారై.. మనసున్న ‘శ్రీమంతుడు’1
1/1

ఈ ఎన్నారై.. మనసున్న ‘శ్రీమంతుడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement