
‘రైతు పక్షపాత ప్రభుత్వం’
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో ఉన్నది రైతు పక్షపాత ప్రభుత్వమని నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, అబ్దుల్ హాది అన్నారు. రైతు భరో సా నిధులు అన్నదాతల ఖాతాలో జమ కావడంతో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం రైతుభరోసా సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచారు. వివిధ మండలాల అధ్యక్షులు కుంట వేణుగోపాల్ , బొల్లోజి నర్సయ్య , మధుకర్రెడ్డి, ఒడ్నాల రాజేశ్వర్, భుజంగా శ్రీనివా స్రెడ్డి , తక్కల సాగర్రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ కొండ్రు రాంరెడ్డి, పీసీసీ సభ్యులు సాదా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.