
పెద్ద నోట్లతో ఇబ్బంది..
ఇంతకుముందు బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే పెద్ద నోట్లతో చిల్లర లేక చాలా ఇబ్బందులు ఉండేవి. రూ.10 టికెట్కు రూ.500 నోటు ఇచ్చేవారు. రూ.15 టికెట్కు రూ.100 ఇచ్చేవారు. దీంతో చికాకు అనిపించేది. ఈ సమయంలో గొడవలు అయ్యేవి. కొన్నిసార్లు టికెట్ వెనుక రాసి ఇచ్చేవాళ్లం. దిగేటప్పుడు ఆ టికెట్ చూపించి చిల్లర తీసుకోమని చెప్పేవాళ్లం. వీటన్నిటికీ ఆర్టీసీ అధికారులు స్వస్తి పలికారు. ఈ కీలక నిర్ణయంతో డ్యూటీలో సంతృప్తి కలుగుతుంది.
– భూలక్ష్మి (కండక్టర్) నిర్మల్ డిపో