పరిష్కారమే మిగిలింది.. | - | Sakshi
Sakshi News home page

పరిష్కారమే మిగిలింది..

Jun 25 2025 7:04 AM | Updated on Jun 25 2025 7:04 AM

పరిష్కారమే మిగిలింది..

పరిష్కారమే మిగిలింది..

● జిల్లాలో ముగిసిన భూభారతి సదస్సులు ● 393 గ్రామాలు .. 16,217 దరఖాస్తులు ● కొనసాగుతున్న ఆన్‌లైన్‌ ప్రక్రియ

నిర్మల్‌చైన్‌గేట్‌: ధరణి పోర్టల్‌లోని లోపాలను సవరిస్తూ, మార్పులు, చేర్పులతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించారు. నిర్దేశిత గడువు జూన్‌ 20తో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 393 గ్రామాల నుంచి మొత్తం 16,217 దరఖాస్తులు వచ్చాయి. మామడ మండలంలో అత్యధికంగా 1,616 దరఖాస్తులు, పెంబిలో అత్యల్పంగా 198 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో 10,927 ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. చట్టం సమర్థవంతంగా అమలు కోసం సర్వేయర్లకు శిక్షణ కొనసాగుతోంది.

సర్వేయర్ల శిక్షణ కొనసాగింపు

భూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 19 మండలాలకు కేవలం 12 మంది రెవెన్యూ సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. దీంతో లైసెన్స్‌ సర్వేయర్లకు అవకాశం కల్పించగా, మీసేవ కేంద్రాల ద్వారా 212 దరఖాస్తులు అందాయి. ఎంపికై న అభ్యర్థులకు గత నెల 26 నుంచి 50 రోజులపాటు శిక్షణ కొనసాగుతోంది. అర్హతలు సాధించిన వారికి లైసెన్స్‌లు జారీ చేస్తారని అధికారులు తెలిపారు.

గ్రామ పరిపాలన అధికారుల నియామకం

భూ భారతి అమలు కోసం గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓల) నియామకానికి ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏలకు అవకాశం కల్పించగా, 151 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మంది దరఖాస్తులు ఆమోదం పొంది, గత నెల 25న రాత పరీక్షకు హాజరయ్యారు. అయితే, అర్హత సాధించిన వారికి ఇప్పటి వరకు నియామక పత్రాలు అందలేదు.

సీసీఎల్‌ఏకు నివేదిక..

రెవెన్యూ సిబ్బంది రోజువారీ దరఖాస్తులను కలెక్టర్‌కు నివేదించారు. కలెక్టర్‌ స్థాయిలో సమస్యల వారీగా నివేదికలను రూపొందించి, సీసీఎల్‌ఎకు పంపించారు. రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవోలు పాల్గొని, దరఖాస్తులను పరిశీలించడంతోపాటు రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని భరోసా కల్పించారు. ఈ విధంగా భూభారతి పోర్టల్‌ ద్వారా భూ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు

మండలం దరఖాస్తులు ఆన్‌లైన్‌

బాసర 442 385

భైంసా 1,270 919

ముధోల్‌ 1,515 765

కుభీర్‌ 460 396

తానూరు 1,084 884

లోకేశ్వరం 1,054 600

నర్సాపూర్‌(జి) 265 244

దిలావర్‌పూర్‌ 1,003 685

సారంగాపూర్‌ 1,302 953

నిర్మల్‌ రూరల్‌ 1,219 700

నిర్మల అర్బన్‌ 208 208

సోన్‌ 638 348

లక్ష్మణచాంద 1,182 903

మామాడ 1,616 768

ఖానాపూర్‌ 729 519

పెంబి 198 171

కడెం 986 678

దస్తూరాబాద్‌ 1,046 801

ఆన్‌లైన్‌ నమోదు తర్వాత..

రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత, సర్వేయర్లు ఇరుగుపొరుగు రైతులకు నోటీసులు జారీ చేసి సర్వే నిర్వహిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత, తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ లాగిన్‌లలో సమాచారం అందుబా టులో ఉంటుంది. తహసీల్దార్‌, ఆర్డీవోలకు డిజిటల్‌ సంతకం అవకాశం కల్పించారు. అన్ని అంశాలు సవ్యంగా ఉంటే, రైతులకు పాస్‌బుక్‌తోపాటు భూమ్యాప్‌ కూడా అందజేస్తారు.

సత్వర పరిష్కారం చూపుతాం

రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిశా యి. సదస్సుల నిర్వహణకు రైతులు సహకరించారు. రైతులు పెద్ద సంఖ్యలో సదస్సులకు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సత్వర పరిష్కారం చూపుతాం. సత్వర పరిష్కారానికి వీలుకాని దరఖాస్తులు ఉంటే అందుకు కారణాలను భూ యజమానులకు తెలియజేస్తాం.

– అభిలాష అభినవ్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement