మత్తును తరిమేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

మత్తును తరిమేద్దాం..

Jun 25 2025 7:04 AM | Updated on Jun 25 2025 7:04 AM

మత్తు

మత్తును తరిమేద్దాం..

● మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములవుదాం ● ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఎస్పీ జానకీషర్మిల పిలుపు

నో డ్రగ్స్‌ అనే ఇంగ్లిష్‌ అక్షరాల ఆకృతిలో మానవహారంగా విద్యార్థులు..

బాసర: సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రమాదకరమైన మహమ్మారి మత్తు, డ్రగ్స్‌ అని, మాదకద్రవ్యాలన నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని ఎస్పీ జానకీషర్మిల పిలుపునిచా ర్చరు. మాదకద్రవ్యాల నిర్మూలన వారోత్సవా ల్లో భాగంగా బాసర ఆర్జీయూకేటీ(ట్రిపుల్‌ఐటీ)లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. జీవి తంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఈ వయసులో ఆకర్షణలకు లోనుకావొద్దని సూచించారు. మత్తుకు బాని సై తే జీవితం అంధకారం అవుతుందని తెలిపారు. ఆరోగ్యంతో పాటు కుటుంబాన్ని, కలలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. నిర్మల్‌ను గంజాయి రహిత జిల్లాగా చేసేందుకు పోలీస్‌శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు. తర్వాత ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో ‘నో డ్రగ్స్‌’ అంటూ నినాదాలు చేయించారు. అక్షర రూపంలో మానవహారం ఏర్పాటు చేశా రు. అనంతరం భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్‌, ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్‌, మిగతా ప్రొఫెసర్స్‌, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో పర్యటించా రు. విద్యార్థులతో మాట్లాడారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముధోల్‌ సీఐ మల్లేశ్‌, డీఎస్బీ సీఐ సమ్మయ్య, బాసర, ముధోల్‌ ఎస్సైలు శ్రీనివాస్‌, పెర్సిస్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

మత్తును తరిమేద్దాం..1
1/1

మత్తును తరిమేద్దాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement