
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని సహస్ర బాక్సింగ్ అకాడెమీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పలువురు క్రీడాకారులు ఎంపికై నట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28, 29 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా నుంచి బాలుర విభాగంలో కౌశిక్రెడ్డి (–42), వేద్ (35), వినయ్ (40–), శ్రీనివాస్ (–45), బా లికల విభాగంలో అక్షయ (45), గీతాంజలి (42), కే దివ్య (–40), సుజల (55), నక్షత్ర (80), గంగా లక్ష్మి (44) ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో సహస్ర బాక్సింగ్ అకాడెమీ కోచ్ చందుల స్వామి, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్, చిరంజీవి, విజయ్, మనీషా, శ్రీజ పాల్గొన్నారు.