
ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ నూతన కార్యవర్గం
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ సమావేశానికి మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలకు చెందిన అసోసియేషన్ సభ్యులు, ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్లుగా ఆర్.నారాయణరెడ్డి, గడ్డం జగన్నాథం, కేవీ ప్రతాప్, జి.భీమ్లానాయక్, అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కె.భాస్కర్, బి.గోవర్ధన్ రెడ్డి, జి.ఈశ్వర్, వి.మహేందర్, మారిన శృతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.తిరుపతి, కోశాధికారిగా యు.శంకర్, సంయుక్త కార్యదర్శులుగా మారిన వెంకటేశ్వర్లు, ఆర్.గోపాల్, సాంబశివరావు, ఎల్.హరిలాల్, అంకం సరిత, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి.భానయ్య, కార్యవర్గ సభ్యులుగా మారిన చందర్, గుజ్జ మల్లేశ్, ఆర్వీ రామకృష్ణ, కె.మల్లేష్, సతీష్, రెడ్డి సతీష్, జి.శ్రీధర్, పి.శ్రీనివాస్, ఏ.జ్యోతి, జి.వెంకన్న, క్రాంతికుమార్, శరత్యాదవ్, సలహాదారులుగా ఎం.లక్ష్మణ్, ఆర్.శ్రీనివాస్రెడ్డి, పి.సాంబయ్య, సదానందం, వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.