
వివాహం కావడంలేదని యువకుడు..
సోన్: వివాహం కావడంలేదని మనస్తాపంతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన గోలి సుదర్శన్ (31) ఆరునెలల క్రితం విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. తనకు వివాహం కావడంలేదని మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఖానాపూర్కు చెందిన జావిద్ ఖాన్పై మంగళవారం కేసు నమోదు చే సినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణానికి చెందిన అబ్దుల్ అజీజ్ ఇద్దరు కుమారులకు కాంట్రాక్ట్ పద్ధతిలో తహసీల్దార్ కార్యాలయంలో, సిటీ యూనియన్ బ్యాంక్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. వారి వద్ద నుంచి రూ.2లక్షల చొప్పున రూ.4లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితులు వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ద్విచక్ర వాహనం చోరీ
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన దార్ల అశోక్ ద్విచక్ర వాహనం మంగళవారం చోరీకి గురైంది. తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనం కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.