
క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 18న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–25 జిల్లా ఎంపిక పోటీలు నిర్వహించారు. 200ల మంది క్రీడాకారులు పాల్గొనగా 90 మందిని ఎంపిక చేసి ఆరు టీంలుగా విభజించారు. ప్రతీ టీంను మిగిలిన అన్ని టీంలతో రెండు రోజుల పాటు ఆడించాలని భావించగా వర్షంతో వాయిదా పడింది. మంగళవారం జిల్లాలోని మూడు మైదానాల్లో ఎంపిక పోటీలు నిర్వహించినట్లు హెచ్సీఎల్ సెక్రటరీ కోదాటి ప్రదీప్, కోచ్ పి.ప్రదీప్ తెలిపారు. మంచిర్యాలలోని ఉషోదయ పాఠశాల, గుడిపేట 13వ పోలీసు బెటాలియన్ మైదానం, మందమర్రిలోని సింగరేణి మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆరు టీంలలో ప్రతిభ కనబర్చిన వారిని ఒక టీంగా చేసి, వారిని ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.