
ప్రాణ రక్షకులు
● ప్రమాద స్థలాలకు క్షణాల్లో చేరుతున్న పైలెట్లు ● క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. ● వైద్య చికిత్సతో నిలబెడుతున్న ప్రాణాలు ● నేడు జాతీయ పైలెట్ దినోత్సవం
చెన్నూర్: 108 అంబులెన్స్ పైలట్లు ప్రాణరక్షకులని.. ప్రమాదం జరిగిందని సమాచారం వస్తే చాలు క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స అందించడంతో వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. పైలట్ల సేవలను పలువురు కొనియాడుతున్నారు. సోమవారం జాతీయ అంబులెన్స్ పైలెట్ దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 అంబులెన్స్లు పని చేస్తున్నాయి. 176 మంది పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్లు ఆయా మండలాల పరిధిలో జరిగే రోడ్డు, ఇతర ప్రమాదాలు జరిగిన సమయంలో సంఘటన స్థలాలకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పైలెట్లు ప్రమాద స్థలాలకు చేరుకునేందుకు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
జిల్లా అంబులెన్సులు పైలెట్
మంచిర్యాల 18 45
అదిలాబాద్ 25 60
నిర్మల్ 15 36
కుమురం భీం 15 35