
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
కుంటాల: అకాల వర్షాలు జిల్లాకు చెందిన అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జొన్నలు తడిసి ముక్కిపోయాయి. తడిసిన ధాన్యం బస్తాలు ఆరబెట్టేందుకు ఆదివా రం రైతులు ఇబ్బంది పడ్డారు. షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.
ఖానాపూర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తోంది. కొన్నిచోట్ల తడిసిన ధాన్యం మొలకెత్తింది. ఖానాపూర్, కడెం మండలాల్లోని స దర్మాట్ ఆయకట్టు కింద 50శాతం వరి కోతకు రా గా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నదా తలు ఆందోళన చెందుతున్నారు.
లక్ష్మణచాంద: నాలుగురోజులుగా కురుస్తున్న వర్షా లకు మండలంలోని రాచాపూర్ సమీపంలో రైతులు ఆరబోసిన ధాన్యం మొలకెత్తింది. ధాన్యం నుంచి మొలకను వేరు చేసేందుకు ఇబ్బంది పడ్డారు.
కుంటాల: జొన్న కుప్పల చుట్టూ నిలిచిన వరదనీరు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఆరబెట్టుకునేందుకు అన్నదాతల పాట్లు

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం