గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

May 1 2025 2:01 AM | Updated on May 1 2025 2:01 AM

గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్‌ ట్రెయినీ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై న సాగర్‌ (29) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్‌ వద్ద కూర్చున్న సాగర్‌ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్‌ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement