‘భూభారతి రైతులకు వరం’ | - | Sakshi
Sakshi News home page

‘భూభారతి రైతులకు వరం’

Apr 30 2025 12:42 AM | Updated on Apr 30 2025 12:42 AM

‘భూభారతి రైతులకు వరం’

‘భూభారతి రైతులకు వరం’

కుంటాల: భూభారతి పథకం రైతులకు వరం లాంటిదని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అందాకూర్‌ గ్రామంలో రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఆధార్‌ లాగే భూధార్‌ ద్వారా నంబర్‌ ఇచ్చి భూమి, హద్దులు గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు. అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. మే 1నుంచి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కమల్‌సింగ్‌, ఎంపీడీవో లింబాద్రి, డీటీ నరేశ్‌గౌడ్‌, ఏవో విక్రమ్‌, ఎంపీవో రహీంఖాన్‌, ఆర్‌ఐలు అడెల్లు, రాజేశ్వర్‌, రైతులు పాల్గొన్నారు.

సోన్‌: మండల కేంద్రంలోని రైతువేదికలో భూభా రతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూభారతి చట్టం, గ్రామ రెవెన్యూ అధికారుల నియామకంతో భూసమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, మండల ప్రత్యేకాధికారి గోవింద్‌, తహసీల్దార్‌ మల్లేశ్‌, ఎంపీడీవో సురేశ్‌, ఎంపీవో కలీం, ఏవో వినోద్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కుభీర్‌: భూభారతి చట్టం కింద భూసమస్యలన్నీ తహసీల్దార్‌ కార్యాలయంలోనే పరిష్కారమవుతాయని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పేర్కొన్నారు. కుభీర్‌లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. గతంలో సాదాభైనామా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, స్పెషలాఫీసర్‌ శంకర్‌, తహసీల్దార్‌ శివరాజ్‌, ఏవో సారిక, ఎంపీడీవో నవనీత్‌కుమార్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement