
రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్చైన్గేట్: గ్రామ రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని మండలా ల తహసీల్దార్లతో భూభారతి, రెవెన్యూ సదస్సులు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా, తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. గతంలో నిర్వహించిన సదస్సులు, గుర్తించిన సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పంచాయతీలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సందర్శించి ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తగినంత ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ భూ రికార్డులను స్కాన్ చేసి, డిజిటల్ రూపంలో భద్రపరచాలన్నారు. వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, రెవెన్యూ అధికారులు సవిత, స్వాతి, ఈడీఎం నదీమ్, తదితరులు పాల్గొన్నారు.