
‘రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ కుటుంబం’
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. నా యకులు భస్వపురం లక్ష్మీనర్సయ్య, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడిసమ్మ రాజు, నల్లా రవీందర్రెడ్డి, ఒడిసెల అర్జున్, ఆకుల కార్తిక్, సుంకరి సాయి తదితరులు పాల్గొన్నారు.