
క్యాన్సర్ రోగులకు ఉపశమనం
● నిర్మల్లో చికిత్సకు ఏర్పాట్లు ● పెద్దాస్పత్రిలో ప్రత్యేక వార్డులు ● త్వరలో అందుబాటులోకి సేవలు
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని క్యాన్సర్ రోగులకు మంచిరోజులు రానున్నాయి. చాపకింద నీరులా మానవాళిని కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు సర్కారు బోధనాస్పత్రుల్లో ప్రత్యేక సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని వై ద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో 20 చొప్పున పడకలతో జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. క్యాన్సర్ కేర్ కేంద్రంలో 10 పడకలను వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు.. మిగతా 10 పడకలను పాలియేటివ్ కేర్ (పక్షవాతంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగించే) నిమిత్తం వినియోగించనున్నారు. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో ఇదివరకే పాలియేటివ్ కే ర్ కేంద్రం ఉంది. ఇక్కడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకూ చికిత్స అందిస్తుండగా సేవలు విస్తరించనున్నారు. జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేర్ కేంద్రాలను ఇటీవల ప్రారంభించాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
స్థానికంగానే చికిత్స
జిల్లా జనరల్ ఆస్పత్రిలో త్వరలో అందుబాటులోకి రానున్న జెరియాట్రిక్ వార్డు, కీమోతెరపీ లాంటి సే వల కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఇద్దరు వై ద్యులు, ఆరుగురు నర్సింగ్ ఆఫీసర్లు ప్రత్యేకంగా హైదరాబాద్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. జిల్లా జ నరల్ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రా గానే చాలామంది క్యాన్సర్ బాధితులు రెగ్యులర్ చె కప్లకు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే వీరి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ పొందన్నారు.
బాధితులు పెరుగుతున్నందునే..
కేన్సర్ బారిన పడిన కొందరికి కీమోతోపాటు రేడియేషన్ థెరపీ అవసరమవుతుంది. కానీ.. ప్రభుత్వ పరంగా ఆ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తోంది. నాన్ కమ్యూనబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తుండగా.. మహిళా ఆరోగ్య కార్యక్రమం ద్వారా బ్రెస్ట్, ఓ రల్, సర్వైకల్ కేన్సర్ బాధితుల గుర్తింపు కొనసాగుతోంది. వీరిలో వ్యాధి ప్రారంభ దశలో ఉంటే జిల్లాలోనే చికిత్స అందిస్తుండగా, సీరియస్ కేసులకు ప్రత్యేకంగా వార్డు లేదు. దీంతో కీమో, రేడియేషన్ థెరఫీ కోసం వారిని హైదరాబాద్కు పంపిస్తున్నా రు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేన్సర్ బాధితులు పె రుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడిక ల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ప్రత్యేకసెంట ర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జెరియాట్రిక్ వార్డులతో ప్రయోజనాలు
మధుమేహం, హైపర్టెన్షన్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లాంటివి ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉండటంతో వృద్ధాప్యంలో వాటిని ఎదుర్కోవటం కష్టతరమవుతోంది. అలాంటివారికి ప్రత్యేక వార్డుల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు (జెరియాట్రిషన్లు) అందుబాటులో ఉంటారు. వృద్ధులకు సరిపడా ఔషధాలు, చికిత్స అందిస్తారు. శారీరక, మానసిక, సామాజిక, ఆరోగ్య అంశాలను సమగ్రంగా పరిశీలిస్తారు. వృద్ధులు ఎదుర్కోబోయే సమస్యలను ముందస్తుగానే గుర్తిస్తారు. ప్రతీ రోగి అవసరాలకు అనుగుణంగా చికిత్స విధానం రూపొందిస్తారు. ఒంటరిత నం, ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక సమస్యల ను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తారు. వృద్ధాప్యంలో ఆరో గ్యకరమైన జీవనశైలి కోసం వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేక సంరక్షణతో రోగులు త్వరగా కోలుకుంటారు.
కీమోథెరపీ, కౌన్సెలింగ్ ఒకేచోట..
రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచటంతో పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడే సహజ సామర్థ్యాన్ని పెంచేందుకు క్యాన్సర్ కేర్ కేంద్రాలు దోహదపడతాయి. క్యాన్సర్కు స్థానికంగా చికిత్స అందుబాటులో ఉండటంతో దూరప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. సమయం, డబ్బు ఆదా అవుతాయి. ప్రత్యేక క్యాన్సర్ కేర్ కేంద్రాలు ఉండటంతో రోగ నిర్ధారణ, చికిత్స త్వరగా ప్రారంభమవుతాయి. ఇవి రోగ నియంత్రణకు సహాయపడతాయి. క్యాన్సర్ చికిత్సలో నైపుణ్యం కలిగిన వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటారు. ఈ కేంద్రాలు క్యాన్సర్ గురించి సమాజంలో అవగాహన కల్పించటానికి, నివారణ చర్యలను ప్రోత్సహించటానికి తోడ్పడతాయి. కీమోథెరపీ, కౌన్సెలింగ్ లాంటి సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయి.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా జనరల్ ఆస్పత్రిలో త్వరలో ప్రారంభించనున్న జెరియాట్రిక్, క్యాన్సర్ చికిత్స సేవలను జిల్లా ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. చాలామంది నిరుపేదలకు ఈ సేవలు ఉచితంగా అందనున్నాయి.
– రాథోడ్ సునీల్ కుమార్, జిల్లా జనరల్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్
వార్డులు సిద్ధం చేశాం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సూచన ల మేరకు త్వరలోనే జి ల్లా ప్రజలకు ఈ సేవల ను అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికో సం వైద్యులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించాం.
– డాక్టర్ గోపాల్సింగ్,
జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్

క్యాన్సర్ రోగులకు ఉపశమనం

క్యాన్సర్ రోగులకు ఉపశమనం