
ఆర్కేపీలో రెండు చోరీలు
● 10 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
రామకృష్ణాపూర్: పట్టణంలోని హనుమాన్నగర్లో రెండు చోరీల ఘటనలను పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. హనుమాన్నగర్కు చెందిన ఇరుముల్ల శరణ్య ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో కిటికీ పక్కన నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని వ్యక్తి తస్కరించాడు. అదేకాలనీలో బుర్ర రాజేంద్రప్రసాద్ ఫోన్ను కూడా కిటికీ నుండే దొంగిలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసుల సహకారంతో పలు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు గోదావరిఖనిలోని కాకతీ యకాలనీకి చెందిన గుంజ ఇమ్మానుయేల్గా గుర్తించారు. మధ్యాహ్నం నిందితుడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఎఫ్టీటీజెడ్ బైక్పై వెళ్తుండగా పట్టుకున్నారు. అతని జేబులో ఉన్న మూడు తులాల గొలుసు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసులను ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహి ంచిన మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్, క్రైంటీమ్ సిబ్బ ందిని ఏసీపీ అభినందించి రివార్డ్లు అందజేశారు.
రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ జరి గింది. ఎస్సై స్వరూప్రాజ్ కథనం మేరకు ఈనెల 18న గ్రామానికి చెందిన కాల్ల రమ, ఊట్నూరి అంజయ్య, ఊట్నూరి లక్ష్మి, ఊ ట్నూరి విశాల్ ఇళ్లలో చోరీ జరిగింది. కాల్ల రమ ఇంట్లో పావుతులం బంగారు పుస్తెలు, ఊట్నూరి లక్ష్మి ఇంట్లో 18 తులాల వెండి ప ట్ట గొలుసులు అపహరించారు. కాల్ల రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.