కోటపల్లి: మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద నార్కోటిక్ జాగిలంతో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అంతరాష్ట్ర చెక్పోస్టు మీదుగా తెలంగాణలోకి వచ్చిపోయే వాహనదారులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి సేవించిన, రవాణ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజేందర్, ఎకై ్సజ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.