పాత‌నోట్ల మార్పిడి అంశాన్ని పరిశీలించండి: వైవీ సుబ్బారెడ్డి | TTD Chairman YV Subba Reddy Meets Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్‌ను కలిసిన టీటీడీ చైర్మన్

Sep 15 2020 9:08 PM | Updated on Sep 15 2020 9:48 PM

TTD Chairman YV Subba Reddy Meets Nirmala Sitharaman - Sakshi

న్యూఢిల్లీ: తిరుమ‌ల ఆల‌య భ‌ద్రత కోసం నియ‌మించుకున్న స్పెష‌ల్ ప్రొట‌క్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్‌) విభాగానికి బ‌కాయి ఉన్న రూ.23.78 కోట్ల జీఎస్టీని ర‌ద్దు చేయాల‌ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం ఢిల్లీలో ఆయ‌న కేంద్ర మంత్రిని క‌లిసి ఈ మేర‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. జీఎస్టీ రద్దు చేయడం వల్ల టీటీడీకి మరింత ఆర్థిక బలం లభించి అనేక సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలను ఇంకా ఎక్కువగా నిర్వహించే అవకాశం కలుగుతుందని వైవీ సుబ్బారెడ్డి కోరారు. తిరుమ‌ల వేంకటేశ్వరస్వామివారికి భ‌క్తులు హుండీ ద్వారా కానుక‌లుగా స‌మ‌ర్పించిన రూ.500, రూ.1,000 నోట్లను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయ‌డానికి అనుమ‌తించాల‌ని వైవీ సుబ్బారెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.             

కేంద్ర ప్రభుత్వం 2016, నవంబ‌రు 8వ తేదీన రూ.1,000, రూ.500 నోట్లను ర‌ద్దు చేసినప్పటి నుంచి టీటీడీ న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్సహించ‌డానికి అనేక ఏర్పాట్లు చేసింద‌న్నారు. అయితే భ‌క్తులు ఆ త‌రువాత కూడా స్వామివారికి హుండీ ద్వారా ర‌ద్దు అయిన నోట్లు కానుక‌గా స‌మ‌ర్పిస్తూ వ‌చ్చార‌న్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం కావ‌డంతో భ‌క్తులు ఈ నోట్లను హుండీలో స‌మ‌ర్పించ‌కుండా నిరోధించే ఏర్పాట్లు టీటీడీ చేయ‌లేక‌పోయింద‌ని ఆయ‌న చెప్పారు. అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రుపుతున్న టీటీడీ హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వహిస్తోంద‌ని సుబ్బారెడ్డి మంత్రికి వివ‌రించారు.  (దేశంలో 37 మెగా ఫుడ్‌ పార్కులకు గ్రీన్‌సిగ్నల్‌)

టీటీడీ వ‌ద్ద నిల్వ ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌డం ద్వారా ల‌భించే సొమ్ముతో మ‌రిన్ని ధార్మిక‌, సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చని చెప్పారు. పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టీటీడీ అనేక‌సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌, రిజ‌ర్వు బ్యాంకుకు లేఖ‌లు రాసి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పంద‌న రాలేద‌ని ఆయ‌న వివ‌రించారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని టీటీడీ వ‌ద్ద నిల్వ ఉన్న పాత నోట్లను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయ‌డానికి త‌గిన ఉత్తర్వులు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. (బంజారాహిల్స్‌లో గుట్టలుగా హవాలా సొమ్ము)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement