
డాక్టర్ల సమస్యను కొలిక్కి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొద్ది సేపటి క్రితమే డాక్టర్లతో భేటీ అయ్యారు.
కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ ఘటనపై సీఎం మమతా బెనర్జీతో వైద్యుల బృందం మరోసారి భేటీ అయ్యింది. మమతా బెనర్జీ ఇంటికి బస్సులో చేరుకున్న డాక్టర్లు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. చర్చలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తోంది వైద్యుల బృందం. అభయ ఘటనలో సీబీఐ అధికారుల విచారణ నిస్పక్షపాతంగా, వేగంగా జరగాలని కోరుతున్నారు.
వ్యవస్థల వైఫల్యం ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కేసును తప్పుదారి పట్టించిన హెచ్ఓడీలను తొలగించాలని కోరుకుంటున్నారు. డీసీపీతో పాటు పోలీసు అధికారులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ను రద్దు చేయాలని, వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఆందోళన చేస్తున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు.
ఇదీ చదవండి : గుంజీలు తీసిన విద్యార్థినులకు అస్వస్థత