కోర్టు విచారణ సమయంలో అర్థనగ్నంగా దర్శనం..

Indira Jaising File Complaint Over Semi Naked Man Visible On Virtual Hearing - Sakshi

వర్చువల్‌ వాదనలకు అర్ధనగ్నంగా హాజరు.. సీనియర్‌ లాయర్‌ ఫిర్యాదు

సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ కారణంగా పలు కోర్టుల్లో వాదనలు వర్చువల్‌గా కొనసాగుతున్నాయి. హైకోర్టులో వర్చువల్‌గా వాదనలు జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసుకు సంబంధించిన వ్యక్తి అర్ధనగ్నంగా వర్చువల్‌ వాదనలకు హాజరయ్యాడు. ఈ ఘటన కర్ణాటక హైకోర్టులో చోటుచేసుకుంది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్ హైకోర్టులో వర్చువల్‌ వాదనలు జరుపుతున్న సమయంలో సదరు వ్యక్తి  అర్ధ నగ్నంగా కనిపించడంతో ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేశారు.

చదవండి: Omicron Variant: కొత్త వేరియంట్‌ కట్టడి ఎలా?.. ప్రస్తుతానికి నో లాక్‌డౌన్‌: ఆరోగ్యమంత్రి 

‘వాదనలు వినిపిస్తున్న సమయంలో సుమారు 20 నిమిషాల పాటు ఆ వ్యక్తి అర్ధనగ్నంగా స్క్రీన్‌పై కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తిపై అధికారికంగా కోర్టు ధిక్కరణ, లైంగిక వేధింపుల కింద ఫిర్యాదు చేశాను. ఇది కచ్చితంగా వాదనలను అడ్డుకునే ప్రయత్నం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఫిర్యాదు మేరకు కర్ణాటక హైకోర్టు ఆ వ్యక్తికి నోటిసులు జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top