Indian Navy Helicopter Makes Emergency Landing Off Mumbai Coast - Sakshi
Sakshi News home page

ముంబై తీరంలో.. నేవీ హెలికాప్టర్‌ ధ్రువ్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.... సిబ్బంది సేఫ్‌

Published Wed, Mar 8 2023 12:41 PM

Indian Navy Helicopter Emergency Landing Off Mumbai Coast - Sakshi

సాక్షి, ముంబై: భారత నౌకా దళానికి చెందిన హెలికాప్టర్‌ ఒకటి.. ముంబై తీరంలో బుధవారం అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.  ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ధ్రువ్‌ హెలికాఫ్టర్‌ రొటీన్‌ డ్యూటీలో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు నేవీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. 

అత్యాధునిక తేలికపాటి యుద్ధవిమానం అయిన ధృవ్‌.. ముంబై తీరంలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ గురించి సమాచారం అందుకున్న వెంటనే నేవీ పెట్రోలింగ్‌ స్పందించింది. హెలికాఫ్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు తెచ్చింది. 

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు వెల్లడించారు.

(చదవండి: మోదీ, షా, నడ్డా సమక్షంలో.. త్రిపుర సీఎంగా డాక్టర్‌ మాణిక్‌ సాహా ప్రమాణం)

Advertisement
Advertisement