ఫుడ్‌ పార్సిళ్లపై ప్యాకింగ్‌ సమయమూ ఉండాలి | Food parcels to have use-by time label | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ పార్సిళ్లపై ప్యాకింగ్‌ సమయమూ ఉండాలి

Feb 2 2023 6:12 AM | Updated on Feb 2 2023 6:12 AM

Food parcels to have use-by time label - Sakshi

తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది.

అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్‌ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు ఆహార తనిఖీలను  ముమ్మరం చేశారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement