రాష్ట్రాలకు విపత్తు నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..
Published
Wed, Jul 12 2023 8:09 PM
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు, వరదల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాదిలో భారీ వర్షాల వల్ల జనజీవనవం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం బుధవారం విపత్తు నిధులను విడుదల చేస్తున్నట్టు తెలిపింది.
కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నిధుల విడుదల మార్గదర్శకాలను కేంద్రం సడలించింది. గతేడాది యటిలైజేషన్ సరిఫ్టికెట్ల కోసం ఎదురుచూడకుండా నేరుగా నిధులను విడుదల చేసింది. ఇక, ఏపీకి రూ.493.60 కోట్లు, తెలంగాణకు రూ.188.80 కోట్లు, మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,420.80 కోట్లు విడుదల చేసింది.
The government of India today released Rs 7,532 crores to 22 State Governments for the respective State Disaster Response Funds (SDRF). pic.twitter.com/cyEkyHCuNg