కెనడా‌‌‌‌‌‌-అమెరికా సరిహద్దులో నలుగురు భారతీయుల మృతి

Canada And US Border: Four Indians Died  - Sakshi

న్యూఢిల్లీ: భారత దేశానికి చెందిన నలుగురు వ్కక్తులు కెనడా‌‌‌‌‌‌-అమెరికా సరిహద్దు ప్రాంతంలో మృతి చెందినట్లు ఆ దేశాల సరిహద్దు అధికారులు గుర్తించారు. వెంటనే భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్.​ జైశంకర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల్లో పసిపాప కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన జైశంకర్​ ఆయాదేశాల్లో ఉన్నటువంటి భారత రాయబారులను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారిని గుర్తించాలని.. అదే విధంగా ఘటనపై  సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top