జూరాలకు తగ్గుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు తగ్గుతున్న వరద

Sep 4 2025 10:47 AM | Updated on Sep 4 2025 10:47 AM

జూరాలకు తగ్గుతున్న వరద

జూరాలకు తగ్గుతున్న వరద

ధరూరు/ఆత్మకూర్‌/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 1.26 లక్షల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1,02,950 క్యూసెక్కులకు తగ్గినట్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్‌గేట్లను ఎత్తి 66,776 క్యూసెక్కులు దిగువకు వదిలామన్నారు. విద్యుదుద్పత్తికి 38,225 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 70, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 700, భీమా లిఫ్టుకు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.571 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.

474 మెగావాట్ల విద్యుదుత్పత్తి..

జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో బుధవారం విద్యుదుత్పత్తి కొనసాగిందని ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 276.486 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 303.685 మి.యూ. ఉత్పత్తి జరినట్లు చెప్పారు. ఎగువ, దిగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఇప్పటి వరకు 580.171 మి.యూ. ఉత్పత్తి చేపట్టామన్నారు.

సుంకేసు జలాశయం..

సుంకేసుల జలాశయం 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 80 వేల క్యూసెక్కుల వరద రాగా.. 18 గేట్లను మీటర్‌ మేర తెరిచి 76,356 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్‌కు 2,095 క్యూసెక్కులు వదిలినట్లు వివరించారు.

10 క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు

నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement