
పర్యావరణానికి పెద్దపీట
నర్వ: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖలు చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం ఏకోక్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరిట ఏర్పాటు చేయాలని ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 31 నాటికి సంబంధిత వెబ్సైట్లో వివరాలను పొందుపర్చాలని హెచ్ఎంలకు సూచించింది. పాఠశాలల్లోని ప్రతి తరగతిలో చురుకై న విద్యార్థులు ఐదు మందిని క్లబ్లో భాగస్వామ్యం కల్పించాలని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. ఈ క్లబ్లో పాఠశాలల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. పర్యవేక్షణ కోసం హెచ్ఎంలకు బాధ్యతలను అప్పగించింది. ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి పర్యావరణపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని సూచించింది. దీంతో పాటు వివిద రకాల కార్యక్రమాల ద్వారా చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు విద్యాశాఖ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా.. పాఠశాల పిల్లలతో క్లబ్లు ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టునుంది. ఈ క్రమంలో విద్యార్థులకు బాధ్యతలు నేర్పించడం, వారి హక్కులకు పరిరక్షించేందుకు క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులకు గతంలోనే శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విద్యార్థుల కోసం 1098 నంబర్ను, పోలీస్ సేవల కోసం డయల్ 100 నంబర్లను గోడలపై రాయించడమే కాకుండా వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
ప్రత్యేక నిధులు మంజూరు
జిల్లాలో మొత్తం 406 పాఠశాలకు గాను 2024–25 వార్షిక ఏడాదిలో ఏకో క్లబ్ల నిర్వహణ కోసం రూ.16.82 లక్షలు విద్యాశాఖ మంజూరు చేసింది. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 299 గాను రూ.8.97 లక్షలు , యూపీఎస్ పాఠశాలలకు 86కు గాను రూ.4.30 లక్షలు, ఉన్నత పాఠశాలలు 63కుగాను రూ.3.15 లక్షలు, హెచ్ఎస్ఎస్ పాఠశాలలకు 8కు గాను రూ.40 వేలు మంజూరయ్యాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలకు ఒక్కో పాఠశాలకు రూ.3 వేలు, మిగిలిన పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.5 వేల చొప్పున కేటాయించారు. 2025–26 కు విద్యాసంవత్సరానికి గాను పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికై న 19 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.10 వేల చొప్పున రూ1.90 లక్షలు మంజూరయ్యాయియి.
తప్పక అమలుచేయాలి
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యూత్ అండ్ ఏకో క్లబ్లను ఏర్పాటు చేసి నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణంపై ప్రాథమిక దశలోనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. గత ఏడాది నుంచి ఈ క్లబ్ల ద్వారా పాఠశాలల ఆవరణలో కిచెన్గార్డెన్స్ ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్కు నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమాల కోసం నిధు లు మంజూరయ్యాయి. ప్రతి పాఠశాలలో వారు చేపట్టే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలల్లో టోల్ఫ్రీ నంబర్లు విధిగా రాయించాలి. విద్యార్థులకున్న హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
– విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి
క్లబ్ ద్వారా నేర్పించేవి..
పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పెంచడం
మొక్కలను, ప్రకృతిని విద్యార్థులకు పరిచయం చేయడం
పర్యావరణంపై విద్యార్థులకు అవగతమయ్యేలా ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం
ప్రకృతి ప్రాముఖ్యతను తెలియజేసేలా వివిధ నినాదాలతో వాల్పోస్టర్లు రూపొదించడం
పర్యావరణ, ధరిత్రి దినోత్సవాలు, చర్చగోష్టీ, విద్యార్థులకు పోటీలు నిర్వహించడం
పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి వాటి సమాచారం తెలుసుకునేలా చూడటం
తోటలను పెంచి ఆకుకూరలు, కూరగాయలను మధ్యాహ్న బోజనం తయారీలో వినియోగించటం
ఈ వ్యర్థాల సేకరణపై అవగాహన తరగతులు నిర్వహించటం
పాఠశాలలో నీటి వృథా, ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడిపై అవగాహన
పాఠశాలల్లో ఏకో క్లబ్ల ఏర్పాటు
విద్యార్థి స్థాయి నుంచే అవగాహనకల్పించేందుకు చర్యలు
ఆరోగ్యకరమైన జీవనశైలియే లక్ష్యం
పీఎంశ్రీ పాఠశాలల్లో క్లబ్ల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు

పర్యావరణానికి పెద్దపీట

పర్యావరణానికి పెద్దపీట