
స్నాతకోత్సవానికి వేళాయె
స్పాన్సర్లకు అవకాశం..
మూడు గోల్డ్ మెడల్స్ చొప్పున
మొత్తం 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 13 పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మ, బీపెడ్, ఎంపెడ్, ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులు ఉండగా.. వీటితో పాటు డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేయనున్నారు. వీటితోపాటు పీయూలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు.
కాన్వకేషన్లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
● పీయూలో 4వ కాన్వకేషన్కు సిద్ధమవుతున్న అధికారులు
● హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం
● యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మలో మొత్తం 88 మందికి గోల్డ్మెడల్స్
● రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ఇచ్చే అవకాశం

స్నాతకోత్సవానికి వేళాయె