పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు

Jun 28 2025 5:31 AM | Updated on Jun 28 2025 7:24 AM

పిల్లలను పనిలో  పెట్టుకుంటే చర్యలు

పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు

నారాయణపేట: పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఆపరేషన్‌ ముస్కాన్‌–11 కి సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్‌, జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, వైద్యారోగ్య శాఖలతోపాటు బాలల సంక్షేమ సమితి, లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌ సమన్వయంతో జులై 1 నుంచి 31 వరకు స్పెషల్‌ డ్రైవ్‌లో ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. అలాగే నెల రోజుల స్పెషల్‌ డ్రైవ్‌ ప్రోగ్రాం కి సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేయాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ లింగయ్య, డీసీఆర్‌బీ, లేబర్‌ ఆఫీసర్‌ మహేష్‌ కుమార్‌, రాధ తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌అడ్మిషన్లు ప్రారంభం

మరికల్‌: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ చెన్నరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితోపాటు, ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపులో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు జులై 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మధ్యలో చదువు మానేసిన వారు, ఏదేని పనిచేసుకుంటూ చదువు కొనసాగించాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశమని, పూర్తి వివరాలకు సెల్‌ నం.9985523526, 83418 51534లను సంప్రదించాలని తెలిపారు.

5న సాగునీటి

సమస్యపై సదస్సు

పాలమూరు: పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సాగునీరు సమస్యలపై జూలై 5న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను శనివారం మహబూబ్‌నగర్‌లోని టీఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉందని తెలిపారు. కానీ కృష్ణా, తుంగభద్ర లాంటి జీవనదులు ఉన్న కావాల్సిన నీరు లేక భూములు బీడుగా మారుతున్నాయని వాపోయారు.

మొక్కజొన్న @ రూ.2,310

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,310, కనిష్టంగా రూ.2,248 ధరలు లభించాయి. జొన్నలు గరిష్టంగా రూ.4,230, కనిష్టంగా రూ.2,000, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,771, కనిష్టంగా రూ.1,601, ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,929 ధరలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement