
జూరాల కాల్వకు నీటి విడుదల
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం డీఈ నారాయణ, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ఖాన్ ప్రత్యేక పూజలు చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మునుపెన్నడూ లేని విధంగా ముందుస్తుగా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పీజేపీ సిబ్బంది నిరంతరం కాల్వ వెంట తిరుగుతూ ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో పీజేపీ ఏఈ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రశేఖర్రెడ్డి, చుక్కా ఆశిరెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రహమతుల్లా, పరమేష్, నల్గొండ శ్రీను, మొగిలి గంగాధర్గౌడ్, బంగారు భాస్కర్, తులసీరాజ్, ఏకే వెంకటేశ్వర్రెడ్డి, హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు.
కుడి, ఎడమ కాల్వలకు..
జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, నీటిని, కుడి కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఏటా వానాకాలం పంటల సాగుకు జులై చివర, ఆగస్టులో సాగునీరు వదిలే వారని.. ఈసారి ముందస్తుగా జూన్లోనే ఆయకట్టుకు నీటిని అందించడం హర్షణీయమన్నారు.