అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట | - | Sakshi
Sakshi News home page

అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట

Jun 23 2025 5:32 AM | Updated on Jun 23 2025 5:32 AM

అర్చక

అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట

నర్వ: దూప దీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట కార్యక్రమం చేపట్టామని డీడీఎన్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మాడపాటి జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఆదివారం నర్వ మండలంలోని పలు దేవాలయాలను సందర్శించి అర్చకుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను హిందూ సమాజానికి అందిస్తూ, ధర్మ పరిరక్షణకు కృషిచేస్తున్న అర్చకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం అర్చకులను కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో డీడీఎన్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోషి రామాచారి, ప్రవీణ్‌ కడ్మూర్‌, మండల అధ్యక్షుడు నర్సింహయ్య, నాగస్వామి, అంపయ్య, మధుసూదన్‌చారి, సిద్ధయ్య పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు

చెల్లించండి

నారాయణపేట రూరల్‌: ఉపాధ్యాయులకు పెండింగ్‌ బిల్లులను వెంటనే క్లియర్‌ చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎయిడెడ్‌ దయానంద్‌ విద్యా మందిర్‌ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేసి.. ఓపీఎస్‌ అమలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న హెచ్‌ఎంల పోస్టులను భర్తీ చేయడంతో పాటు డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు పారితోషికం చెల్లించాలన్నారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లకు వేతన సమస్య తీర్చడంతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. రెండేళ్లుగా ప్రకటించాల్సిన పీఆర్సీ నివేదికను వెంటనే వెలువరించి.. మెరుగైన పీఆర్సీ అమలు చేయాలన్నారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయులకు బకాయి బిల్లులతో పాటు ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, మిగిలిన డీఏలను చెల్లించాలన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల పనివేళలు మార్చాలని.. కేజీబీవీ టీచర్లకు బేసిక్‌ పే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శివరాములు, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, ఉపాధ్యక్షులు కె.బాలాజీ, రవికుమార్‌, గోవిందు, వెంకట్‌ నాయక్‌, వెంకటేశ్‌, శంకర్‌ ఉన్నారు.

4 వేల బస్తాల

వరిధాన్యం రాక

నవాబుపేట: స్థానిక మార్కెట్‌కు ఆదివారం ఆర్‌ఎన్‌ఆర్‌, ఇతర సీడ్‌ (1010)లు కలిసి దాదాపు 4 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రమే్‌ష్‌ తెలిపారు. కాగా.. వరి (1010) రకం 1,209 బస్తాలు రాగా క్వింటాల్‌ గరిష్టంగా రూ.1,963 ధర వచ్చింది. అలాగే వరి ఆర్‌ఎన్‌ఆర్‌ 3,628 బస్తాలు రాగా క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,285, కనిష్టంగా రూ.1,512 ధర పలికిందని కార్యదర్శి తెలిపారు.

కేజీబీవీల్లో ఇక కొత్త మెనూ

పౌష్టికాహారం అందించేందుకు చర్యలు

నెలలో రెండుసార్లు మటన్‌తో భోజనం

అందని వేతనాలు.. కార్మికుల పస్తులు

మల్టీపర్పస్‌ వర్కర్ల ఇబ్బందులు

మూడు నెలలుగా చెల్లింపుల్లో జాప్యం

అర్ధాకలితో విధులకు హాజరు

వివరాలు 9లో u

అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట 
1
1/1

అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement