
ఆమడదూరంలో అపార్
వంద శాతం పూర్తి చేస్తాం
విద్యార్థుల ఆధార్ నంబర్లు ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం, విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డులో, అడ్మిషన్ రికార్డులలో వేరువేరుగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో నమోదు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. సాంకేతిక సమస్యలు తొలగిపోతే పూర్తిస్థాయిలో అపార్ నమోదు జరగనుంది. ఆధార్ తప్పులను సరి చేసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. త్వరలో వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– గోవిందరాజు, డీఈఓ
●
‘నారాయణపేట మండలంలోని భైరంకొండ గ్రామానికి చెందిన విద్యార్థి పుట్టినతేదీ యు డైస్లో ఒక విధంగా, ఆధార్ కార్డులో మరో విధంగా ఉండటంతో అపార్ జనరేషన్ కాలేదు. అలాగే షేర్నపల్లికి చెందిన ఓ విద్యార్థిని యు డైస్లో ఇంటి పేరు ఉండగా, ఆధార్కార్డులో లేకపోవడంతో మ్యాచ్ కాక అపార్ జనరేట్ కాలేదు.. జిల్లాలో ఇలా చాలామంది విద్యార్థులకు ఈ పరిస్థితి నెలకొంది.
మొదటి స్థానంలో కొత్తపల్లి.. చివరలో నర్వ
జిల్లాలోని 13 మండలాల్లో ప్రక్రియ మందకోడిగానే సాగుతోంది. కొత్తగా ఏర్పాటు అయిన కొత్తపల్లి మండలంలో 62శాతం అపార్ పూర్తి చేసి మొదటి స్థానంలో నిలువగా, 42 శాతం మాత్రమే ఆన్ లైన్ చేసి నర్వ చివరి స్థానంలో ఉంది. విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు రోజువారీగా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్న సాంకేతిక కారణాల దృష్ట్యా అపార్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆధార్ సమాచారం సరి చేసుకోవడానికి పెట్టుకునే దరఖాస్తు పరంగా అవసరమైన పత్రాలను తొందరగా మంజూరయ్యే విధంగా మండల యంత్రాంగం దృష్టి సారించడంతోపాటు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను తెరిస్తే విద్యార్థులకు ప్రయోజన కరంగా ఉంటుంది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కావడంతో నూతనంగా చేరే విద్యార్థులకు సైతం అపార్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
మందకొడిగా సాగుతున్న విద్యార్థుల నమోదు
● ఆధార్తో వివరాలు సరిపోక తీవ్ర జాప్యం
● విద్యాసంస్థల్లో తప్పని అవాంతరాలు
● నూతన విద్యా సంవత్సరంలో ప్రారంభం కాని ప్రక్రియ
● జిల్లాలో 61శాతం మాత్రమే పూర్తి..
నారాయణపేట రూరల్: జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో ప్రతి విద్యార్థికి అపార్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కార్పొరేట్ విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి 12 అంకెలతో కూడిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ సంఖ్యను కేటాయించాలని నిర్ణయించారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం 2023 అక్టోబర్ 18న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా ఆధార్ లోని సమాచారం విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్ లోని వివరాలతో సరిపోలక సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. ఎందుకు కారణంగా నిర్ణీత సమయంలో నమోదు ప్రక్రియ పూర్తికాక ఆలస్యం అవుతుందని వాదన వినిపిస్తుంది.
సమాచారంలో తేడాలతో జాప్యం
చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ లో విద్యార్థుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు పాఠశాలకు ప్రత్యేక ఐడీలు ఉంటాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ అపార్ కార్డులను మంజూరు చేయనున్నారు. విద్యార్హతలు, గ్రేడ్లు, మార్కులు, సాధించిన ప్రగతి, ఉపకార వేతనాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల సమాచారాన్ని, కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరుస్తారు. ఉన్నత విద్యా ప్రవేశాలు, పోటీ పరీక్షల కు ఈ డిజిటల్ పత్రాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇదిలాఉండగా, జిల్లాలోని 13 మండల పరిధిలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో కలిపి 1,04,428 మందు విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా కేవలం 55,699 మంది విద్యార్థుల వివరాలు ఇప్పటి వరకు అపార్ కు అనుకూలంగా ఉండి 61శాతం నమోదైంది. మిగతా విద్యార్థులకు సంబంధించిన సమాచారంలో తేడాలు ఉండడంతో నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ఆధార్ లోని విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ లలో అడ్మిషన్ రిజిస్టర్ లతో పోలికలు కుదరక అపార్ జనరేట్ కావడం లేదు. అన్ని వివరాలు సరిపోలిన విద్యార్థులకి ఇబ్బంది లేకుండా అపార్ నమోదవుతుంది. కొన్నిచోట్ల ముఖ్యంగా పాఠశాలలలో ఆధార్ ను సరిచూసుకొని వారి అడ్మిషన్ రికార్డులలో వివరాలు సరిచేసి అపార్ నమోదు చేస్తున్నట్లు తెలిసింది. టెన్త్ పూర్తయి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు ఈ వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా విద్యార్థులు తప్పకుండా ఆధార్ కార్డు లోని వివరాలను సరి చేసుకోవాల్సి ఉండడంతో స్థానికంగా ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంచకపోవడంతో హైదరాబాద్ కు పరుగులు పెడుతున్నారు.

ఆమడదూరంలో అపార్

ఆమడదూరంలో అపార్

ఆమడదూరంలో అపార్

ఆమడదూరంలో అపార్