
ఆర్టీసీ బాదుడు
●
ఇష్టారీతిగా పెంచడం సరికాదు
గతంలో చిల్లర సమస్య పేరుతో చార్జీలను రౌండ్ ఫిగర్ చేసి భారం మోపిన ఆర్టీసీ తాజాగా కిలోమీటర్లను రౌండ్ ఫిగర్ చేస్తున్నట్లు అసంబద్ధంగా ఇష్టారీతిగా చార్జీలు పెంచడం సరికాదు. ప్రతి టికెట్పై రూ.10, టోల్గేట్ దాటితే అదనంగా మరో రూ.10 వసూలు చేస్తున్నారు. సీజన్ పాస్ నెలకు మరో రూ.400 చెల్లించాల్సి వస్తుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
– సందీప్, ప్రయాణికుడు, నారాయణపేట
పేద విద్యార్థులపై ఆర్థిక భారం..
ఉన్నత విద్యను అభ్యసించాలని ఆర్టీసీ బస్సుల్లో పట్టణాలకు వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరికాదు. రూ.75 నుంచి ఏకంగా రూ.275 చొప్పున నెలవారి రాయితీ పాసుల ధరలను పెంచడం ఆయా కుటుంబాలకు మోయలేని భారంగా మారుతుంది. ఆడపిల్లలతోపాటు చదువుకునే బాలురకు సైతం ఉచితంగా పాసులు అందించి ఆదుకోవాలి.
– నరేష్, ఏబీవీపీ
జిల్లా కన్వీనర్, నారాయణపేట
స్వల్పంగా పెరిగింది..
ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో టోల్గేట్ ధరలను పెంచుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ అందుకు అనుగుణంగా ప్రయాణికుల టికెట్పై ఆ భారాన్ని సరిచేస్తారు. ఈసారి కొంత ఆలస్యంగా వాటిని అమలు చేశాం. ఇక పల్లె వెలుగు మాదిరి ఎక్స్ప్రెస్ బస్సులకు సైతం రౌండప్ కిలోమీటర్లకు టికెట్ ధరను సరిచేయడంతో కొన్ని స్టేజీలకు టికెట్పై స్వల్పంగా ధర పెరిగింది.
– సంతోష్కుమార్,
రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్
– నారాయణపేట రూరల్
ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సుల టికెట్ ధరలు కిలోమీటర్ల రౌండ్ ఫిగర్తో నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఎక్స్ప్రెస్ సర్వీసులో మాత్రం సరిగ్గా కిలోమీటర్కి లెక్కించి టికెట్ ధర నిర్ణయిస్తారు. అయితే గతంలో చిల్లర సమస్య పేరుతో టికెట్ ధరలను రౌండప్ పేరుతో పెంచారు. తాజాగా మరోసారి కిలోమీటర్లను సర్దుబాటు చేస్తున్నామనే పేరుతో రూ.10 పెంచేశారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం పడనుంది. దీనికితోడు టోల్గేట్ దాటి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు అదనంగా మరో రూ.10 చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆయా మార్గాల్లోని ప్రయాణికులపై గరిష్టంగా రూ.20 భారం పడినట్లయ్యింది.
సర్దుబాటు, టోల్ ప్లాజా పేర్లతో..

ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు