
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని డీఎచ్ఎంఓ మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో హైద్రాబాద్, మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశలోనే క్రీడల పట్ల మక్కువ చూపాలన్నారు. క్రీడలతో శారీరక ధృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. ఉచితంగా కోచింగ్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయమంటూ.. అసోసియేషన్లను ప్రత్యేకంగా అభినందించారు. కోచింగ్ తీసుకున్న విద్యార్థులు భవిష్యత్లో క్రికెట్ పోటీల్లో సత్తా చాటి జిల్లాకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులకు సెర్టిఫికెట్లు జారీ చేశారు. సమ్మర్ క్రికెట్ క్యాంప్ ఇన్ఛార్జ్ రమణ, డాక్టర్ వినోద్, కోచ్ అజయ్. చెన్నారెడ్డి, జనార్ధన్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.